గిరిజాగృతి సొసైటీ ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులకు పత్రాలు, షీల్డ్లు పంపిణీ...
ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం పాడేరు కాఫీ హౌస్ లో గిరిజాగృతి సొసైటీ అధ్యక్షులు మరియు పునర్వా ఏబీవీపీ కార్యకర్త మోరి సింహచలం ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభ అవార్డ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యతిధిగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏ ఏ ఈస్ పి, కేంద్ర కాఫీ బోర్డు సభ్యులు కురుసా ఉమామహేశ్వరరావు, జిల్లా డి ఇ సుభ్రమణ్యం పాల్గొని వారి చేతులు మీదిగా 80 మంది విద్యార్థులకు పత్రాలు, షీల్డ్లు ఇవ్వడం జరిగింది.