రియాల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జెట్టి శేషారెడ్డి కళాభవన్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రియాల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. 



ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి రియల్ ఎస్టేట్ విభాగంలో పనిచేస్తున్న కంపెనీ యజమానులు వర్కర్లు పాల్గొన్నారు.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  రియాల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ, ఆంధ్ర ప్రదేశ్ లోని రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి, రియాల్టర్ల తో కలిసి పనిచేయడానికి తన నిబద్ధతను  తెలియజేస్తూ ప్రోత్సహించాలనినిర్ణయం తీసుకుంది అలాగే కొన్ని తీర్మానాలను కూడా తీసుకోవడం జరిగింది.



ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రియాల్టర్ల సంక్షేమాన్ని ప్రోత్సహించడం రియల్ ఎస్టేట్ పరిశ్రమ ప్రయోజనం పెంపొందించడం రియల్ ఎస్టేట్ నిపుణుల కోసం సమగ్రమైన నీతి నియమావళి క్లైంటు క్లస్టమరు మరియు ప్రజలకు వారి విధులను వివరిస్తూ ముఖ్య సూత్రాలతో విశ్వశీనిధి నిజాయితీ మరి ప్రార్థన న్యాయం గోప్యత బహిర్గతం వృత్తిపరమైన సామర్థ్యం ప్రకటనలు లాంటి కొన్ని విషయాల్లో ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 



మరియు రియల్ ఎస్టేట్ కంపెనీల ద్వారా హోదా తో కూడిన ఐడి కార్డులు జారీకి తీర్మానం తీసుకున్నారు అలాగే నివాస ప్లాట్లు, విల్లాలు, భవనాలు భవనాలు వాణిజ్య అస్తులు  భూముల అమ్మకపు ధరపై 1% కమిషన్ అధిక రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు చెల్లించాలని నిర్ణయించారు. కమిషన్ విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే పరస్పర చర్చల ద్వారా అవసరమైతే అసోసియేషన్ మధ్యత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.



మరియు అసోసియేషన్ నియమ నిబంధనలకు షరతులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలియజేశారు. అనంతరం నూతన కార్యవర్గ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రఅధ్యక్షులుగా కదిరి శ్రీనివాసులు మరియు ఉపాధ్యక్షులుగా ఆళ్ల శివప్రభూ జి శ్రీనివాసులు డి వెంకటేశ్వర్లు హరికృష్ణ రెడ్డి ఏపీ, జెనరల్ సెక్రెటరీ ఏం రత్నం  ఏ కృష్ణ, భాగ్యరేఖలను ఎన్నుకున్నారు.