RTI ద్వారా సమాచారం అడిగినందుకు 15 వేలు లంచం అడిగిన డిప్యూటీ ఎమ్మార్వో....
సమాచర హక్కు చట్టం ఉన్నదే అక్రమార్కుల గుట్టు బయటపెట్టేందుకు.. దానికి కూడా పేపర్ ఖర్చులు అంటూ లంచం డిమాండ్. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం తెరట్పల్లి గ్రామంలో తన తండ్రి పేరు మీద ఉన్న భూమి వేరే వ్యక్తుల పేరు మీదకి అక్రమ రిజిస్ట్రేషన్ అయిందని.. అది ఎలా, ఏ సంవత్సరం జరిగిందో తెలపాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న ఓ రైతు. దానికి పేపర్ ఖర్చులు ఉంటాయని రూ.15 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు. రైతు దగ్గర నుండి బాలాపూర్ నివాసంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు....
