ఈశాన్య మధ్య రైల్వేలోని నాగ్పూర్ డివిజన్కు చెందిన గోండియా స్టేషన్లో లైన్ నం. 5 వద్ద వాషబుల్ ఏప్రాన్ తొలగింపు మరియు బాలస్టెడ్ ట్రాక్గా మార్పిడి పనుల కారణంగా, క్రింది రైలు సర్వీసులు రద్దు చేయబడినవి:
రైలు నం. 12807 విశాఖపట్నం – హజరత్ నిజాముద్దీన్ సమతా ఎక్స్ప్రెస్, విశాఖపట్నం నుండి 2026 ఏప్రిల్ 5, 7, 8, 9, 11, 12, 14, 15, 16, 18, 19, 21, 22 మరియు 23 తేదీలలో బయలుదేరే సేవలు రద్దు చేయబడినవి.
తిరుగు ప్రయాణంలో, రైలు నం. 12808 హజరత్ నిజాముద్దీన్ – విశాఖపట్నం సమతా ఎక్స్ప్రెస్, హజరత్ నిజాముద్దీన్ నుండి 2026 ఏప్రిల్ 7, 9, 10, 11, 13, 14, 16, 17, 18, 20, 21, 23, 24 మరియు 25 తేదీలలో బయలుదేరే సేవలు రద్దు చేయబడినవి.
ప్రజలు ఈ మార్పులను గమనించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరబడుతున్నారు. కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము.
