నేడు లా నేస్తం నిధులు విడుద‌ల

ఆంద్రప్రదేశ్ లో నేడు లా నేస్తం నిధులు విడుద‌ల


2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవి­డత వైఎస్సార్‌ లా నేస్తం నిధులను సీఎం వైఎస్ జ‌గ‌న్ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూట‌ర్ బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,807 మంది జూనియర్‌ న్యాయవాదులు ఈ ప‌థ‌కానికి అర్హులు. వీరంద‌రికి నెలకు రూ.5,000 స్టైఫండ్‌ చొప్పున 2023 జూలై నుంచి డిసెంబర్‌ వరకు(ఆరునెలలు) ఒక్కొ­క్కరి ఖాతాల్లో రూ.30 వేలు జ‌మ‌చేయ‌నున్నారు.