ప్రజా దర్బార్ కి రెండో రోజు విశేష స్పందన



మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు "ప్రజాదర్బార్" నిర్వహించారు. ఉండవల్లిలో తన నివాసంలో ఆదివారం స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. "ప్రజాదర్బార్" కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. రెండో రోజు ప్రజలు బారులు తీరారు.