ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీల గురించి మరియు డిపాజిట్ ఖతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని పరవాడ ఎ.పి.జి.వి. బ్యాంక్ మేనేజర్ టి. రామ్ అన్నారు.
21వ తేదిన గవర్నమెంట్ జూనియర్ కళాశాల పరవాడ నందు జరిగిన రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ కు ముఖ్య అతిథి గా పాల్గోని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్యాంకింగ్ సేవల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి అని అదేవిధంగా నగదు రైతు లావాదేవీలు వినియోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలని మరీ ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ గురి కాకుండా ప్రతి విద్యార్థి మరియు సామాన్య ప్రజలు కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని ప్రసంగించారు. ఈ వర్క్ షాప్, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అధ్వర్యములో, ప్రాజెక్టు డైరెక్టర్ వి.ఆంజనేయులు మరియు ప్రాజెక్ట్ మేనేజర్ వి.అశోక్ కుమార్ పర్యవేక్షణ లో నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమంలో పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి . వి.నారాయణ రావు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ“ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్యాంకింగ్ ఫోల్డర్లో చేర్చబడాలి, ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి, బ్యాంకు ఉత్పత్తులను ఉపయోగించాలి మరియు బ్యాంకింగ్ సేవలను తెలివిగా ఉపయోగించాలి” అని తెలియజేసారు. ఈ వర్క్ షాప్ లో రిసోర్స్ పర్సన్లు కె . అశోక్ గారు, ఎస్.బాలకృష్ణ గారు ,ట్రైనర్లు పి.దీపక్ గారు , ఎస్.అల్యాణ గారు ఈ క్రింద విషయాలపై డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ నేరాలు, బ్యాంక్ ఖాతాలు, సామాజిక భద్రత పదకాలు గురించి పూర్తి అవగాహన కల్పించారు.