అహిల్యాబాయ్ హోల్కర్ ని మహిళలు స్ఫూర్తి గా తీసుకోవాలి

అహల్యా బాయి హోల్కర్   300 జయంతోత్సవాలలో సందర్భంగా పాడేరు లో ఘన నివాళులు  

పాడేరు, మే 31: అహిల్యాబాయ్ హోల్కర్ ని మహిళలు స్ఫూర్తి గా తీసుకోవాలి అని బీజేపీ ఏ ఎస్ ఆర్ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి పిలుపునిచ్చారు.



కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అహిల్యా బాయ్ హోల్కర్ త్రి శతాబ్ది జయంతోత్సవాలలో భాగంగా శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంత కుమారి ఆధ్వర్యంలో ఏ ఎస్ ఆర్ జిల్లా సమావేశం మోదకొండమ్మ ఆడిటోరియంలో 300 జయంతి కార్యక్రమం ఘనంగా  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇంచార్జీ పుట్టా గంగయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 300 సంవత్సరాల క్రితమే ఒక మహిళ 30 సంవత్సరాలు రాజ్యమేలడమే కాకుండా ఆమె పరిపాలనలో ప్రజలకు ఒక సుస్థిర పరిపాలనందించడం జరిగిందని, ప్రజలను ఆమె కన్న బిడ్డలలా చూసుకోవడం జరిగిందని, ఈరోజు పారిశ్రామికరణ జరుగుతున్న విధంగానే 300 సంవత్సరాల క్రితమే ఆమె రాజ్యంలో వస్త్ర పరిశ్రమలను నిర్మించడం ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించడం, అదే విధంగా పారిశ్రామికీకరణ ప్రోత్సహించడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా భారతదేశంలోని ఎన్నో ప్రఖ్యాత దేవాలయాలు ఆమె చేత నిర్మింపబడినవి, మరికొన్ని పునర్ నిర్మించబడినవి. 300 సంవత్సరాల క్రితమే మాతృ సాధికారికతకు ఆమె జీవితం ధారపోయడం జరిగిందని, అటువంటి మహనీయురాలి త్రితాబ్ద జయంతోత్సవాలు జరుపుకోవడం నిజంగా గర్వించదగిన విషయమని ఆయన అన్నారు.



ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్ఛా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు, ట్రైకార్ డైరెక్టర్ కూడ కృష్ణా రావు, బీజేపీ మైనారిటీ మోర్ఛా రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ పెనుమాక, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లా రామకృష్ణ, యువమోర్చా జోనల్ ఇంచార్జీ మినుముల గోపాల పాత్రుడు, జిల్లా యువ మోర్ఛా జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి మత్యకొండబాబు,  సీనియర్ నాయకులు కుడుముల వెంకట రమణ, లకే అబ్బాయి దొర రిటైర్డ్ ఆర్మీ ఇంజనీరు, మహిళా మోర్ఛా నాయకురాళ్ళు లక్ష్మీ, జిల్లా కార్యదర్శి చిన తల్లి, మండల అధ్యక్షులు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.