పవన్ కల్యాణ్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం

విజయవాడ నోవాటెల్ హోటల్ లో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఘనంగా జరిగింది. 



రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామ కృష్ణ పాల్గొని, రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంబదించి ముఖ్య అంశాలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కి తెలియజేశారు. 



అలాగే విద్యా వైద్యం రోడ్లు డ్రైనేజ్ ల నిర్మాణం, త్రాగునీటి సరఫరా, రైతుల సంక్షేమం వంటి ముఖ్య అంశాలను తెలియజేస్తూ వారికి వినతులు అందజేశారు.